పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇదిలావుంటే ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కానీ దానికి తాలూకు అప్ డేట్స్ మాత్రం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి.ఇక అందులో మొదటిది శ్రద్ధ కపూర్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట.ఇకపోతే  సాహో జంట కాబట్టి నార్త్ ఆడియన్స్ కు దీని వల్ల రీచ్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ మేరకు ఆమెను ఒప్పించడం కూడా జరిగిపోయిందంటున్నారు. కాగా మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ఉంటారా లేదా అనే అనుమానాలకు సంబంధించి క్లారిటీ వచ్చేసిందట.

అయితే దాని ప్రకారం ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో పృథ్విరాజ్ ఉండటం ఖాయమేనట. ఇకపోతే అఫీషియల్ అనౌన్స్ మెంట్ గ్రాండ్ గా ఇస్తారు.ఇదిలావుంటే  కెజిఎఫ్ రాఖీ భాయ్ అలియాస్ యష్ కూడా ఓ ఎపిసోడ్ లో తళుక్కున కనిపిస్తాడట. ఇక అది కథ ప్రకారమా లేక మల్టీ వర్స్ కాన్సెప్ట్ ని విక్రమ్ లో లోకేష్ కనగరాజ్ ఉపయోగించినట్టు ప్రశాంత్ కూడా ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా అనేది సినిమా చూశాకే అర్థమవుతుంది. ఇదిలావుంటే ఒక యాక్షన్ ఎపిసోడ్ ని ఓ పెద్ద లోయలో షూట్ చేయబోతున్నారట. అయితే ఒళ్ళు జలదరించే రేంజ్ లో పిక్చరైజేషన్ ఉంటుందని టాక్.

ఇదిలావుంటే మొత్తానికి సలార్ తో అభిమానులకు ఫీవర్ తెప్పించేలా ఉన్నాడు ప్రశాంత్ నీల్.ఇకపోతే  శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పటిదాకా సగం పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. అయితే విడుదల విషయంలో నిర్మాతలు సైలెంట్ గా ఉన్నారు. కాగా 2023 సంక్రాంతికి ఇది లేదా ఆది పురుష్ ఏదో ఒకటి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇంతకీ సలార్ ఒక భాగమే ఉంటుందా లేక కెజిఎఫ్ లాగా టూ పార్ట్స్ చేస్తారా అనే దాని గురించి కూడా క్లారిటీ లేదు. మొత్తానికి స్పెషల్ సర్ప్రైజులు చాలానే ఇవ్వబోతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: