నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టిన ఎస్ జె సూర్య ఇప్పటికే తెలుగు లో కూడా పలు మూవీ లకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇప్పటికే తెలుగు లో ఖుషి , నాని , కొమరం పులి మూవీ లకు  ఎస్ జే సూర్య దర్శకత్వం వహించాడు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా తెరకెక్కిన ఖుషి మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో అందుకోవడంతో ఎస్ జే సూర్య కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా మంచి గుర్తింపు లభించింది. 

ఆ తర్వాత ఎస్ జె సూర్య దర్శకత్వం వహించిన నాని మరియు కొమరం పులి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఎస్ జె సూర్య మూవీ లకు దర్శకత్వం వహించడం కంటే కూడా సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఎస్ జె సూర్య అనేక మూవీ లలో నటించాడు. తాజాగా శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డాన్ మూవీ లో కూడా ఎస్ జె సూర్య ఒక కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను ఆలరించాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో కూడా ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే సూర్య మరికొన్ని రోజుల్లో డిజిటల్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. ఎస్ జె సూర్య తాజాగా  వందాది అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించాడు. ఆండ్రూ వసంత్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ ను డిసెంబర్ 2 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ్ , తెలుగు , కన్నడ  , మలయాళ , హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కనునట్లు మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: