తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇలా కార్తికేయ 2 మూవీ తో అద్భుతమైన విజయాన్ని ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కార్తికేయ 2  లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించాడు. 

కొన్ని రోజుల క్రితమే 18 పేజెస్ మూవీ నుండి "నన్నయ్య రాసిన" అనే సాంగ్ ను నవంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రేపు అనగా నవంబర్ 22 వ తేదీన "నన్నయ్య రాసిన" అనే సాంగ్ ను సాయంత్రం 4 గంటల 32 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సాంగ్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: