ఇటీవల కాలం లో రెండు మూడు భాషల్లో నటించిన హీరో హీరోయిన్లను పాన్ ఇండియా స్టార్లు అని పిలుస్తూ ఉన్నారు. కానీ ఇలా పాన్ ఇండియా అనే పేరు తెరమీదకి రాకముందే ఆ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించి కేవలం ఒక భాషలో కాదు అన్ని భాషల్లో కూడా స్టార్ హీరోయిన్గా వెలుగొందింది శ్రీదేవి అని చెప్పాలి. ఇక మిగతా భాషల్లోనే కాదు తెలుగులో కూడా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఎన్టీ రామారావు దగ్గర నుంచి చిరంజీవి వరకు అందరి సరసన నటించి బెస్ట్ జోడి అనిపించుకుంది శ్రీదేవి.


 ఇక తెలుగు లో అక్కినేని నాగేశ్వర రావు శ్రీదేవి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అని చెప్పాలి. దీంతో ప్రేక్షకులకు వీరిద్దరి జోడి కూడా ఫేవరెట్ జోడిగా మారిపోయింది. అయితే ఇలా ఇండస్ట్రీలో తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగించిన శ్రీదేవి అటు అక్కినేని నాగేశ్వరరావు వారసుడు నాగార్జునతో కలిసి నటించడానికి మాత్రం వెనకడుగు వేశారట. దీనికి కారణం ఏకంగా ఆయన తండ్రి నాగేశ్వరరావు అన్నది తెలుస్తుంది. ఏకంగా నాగేశ్వరరావుతో ఎన్నో సినిమాల్లో నటించారు శ్రీదేవి.


 దీంతో ఇక ప్రేక్షకులు అందరూ నాగేశ్వర రావుకు మంచి జోడీ గానే శ్రీదేవిని ఊహించుకున్నారు. అలాంటి శ్రీదేవి ఇక మళ్లీ నాగేశ్వర రావు కొడుకు నాగార్జునతో నటిస్తే జనాలు ఏమనుకుంటారో అని భయపడిందట. అందుకే నాగార్జున తో నటించడానికి ఆఫర్ వచ్చినా కూడా తిరస్కరించిందట శ్రీదేవి. అయితే ఈ సమయం లోనే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శ్రీదేవికి భరోసా కల్పించి మీ జంటను మోస్ట్ రొమాంటిక్ జంటగా తీర్చిదిద్దుతాను అంటూ హామీ ఇచ్చి సినిమాలో నటింప చేసాడట. దీంతో వీరిద్దరూ కలిసి ఆఖరి పోరాటం సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: