తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి సుకుమార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుకుమార్ , అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కిన ఆర్య మూవీ తో దర్శకుడి గా తన కెరీర్ ను ప్రారంభించాడు. మొదటి మూవీ లోనే సుకుమార్ తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ తో సినిమాను సూపర్ హిట్ గ మలచడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను కూడా అందుకున్నాడు.

ఆ తరువాత సుకుమార్ తన కెరియర్ లో ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ దర్శకుల లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే దర్శకుడు సుకుమార్ పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప పార్ట్ 1 మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయిన పుష్ప పార్ట్ 1 మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా 18 పేజెస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ ... మేము కొన్ని రోజుల క్రితమే పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ ను ప్రారంభించాము. అలాగే 5 రోజుల చిత్రీకరణను కూడా పూర్తి చేశాం అని సుకుమార్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: