ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్.. కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న చిత్రం మేరీ క్రిస్మస్.. ఈ సినిమాను ఈ మేరీ క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం గతంలో అధికారికంగా ప్రకటించింది. ఈరోజు విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు అధికారిక పోస్టర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అయితే తాజాగా ఒక పోస్టర్ విడుదల చేసిన కత్రినా.. అందులో రెండు వైన్ గ్లాసులు మధ్యలో బ్రేక్ అయినట్టు చూపించారు.

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రమేష్ తౌరాణి , సంజయ్ రోటరీ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. అయితే ఈరోజు విడుదల కావాల్సిన ఈ సినిమాను 2023 సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.. అయితే నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్లే సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే  ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. కత్రినా కైఫ్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఇలా రాసుకు వచ్చింది.. మేము ఈ సినిమాని క్రిస్మస్ రోజు విడుదల చేయాలని అనుకున్నాము.  కానీ అక్కడ ఒకటి ట్విస్ట్ ఉంది.. ఆ ట్విస్ట్ చూడాలి అంటే థియేటర్లలో సినిమా విడుదల అయ్యేవరకు వేచి ఉండండి.. హ్యాపీ మేరీ క్రిస్మస్.. అంటూ క్రిస్మస్ ట్రీ ఐకాన్ ను  ఆమె షేర్ చేసింది.


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ కూడా వైరల్ గా మారుతుంది. అసలు విషయం ఏమిటంటే విజయ్ సేతుపతి మొదటిసారి హిందీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.  ఇప్పటికే తెలుగు , తమిళ్ , మలయాళం చిత్రాల ద్వారా భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి మొదటిసారి హిందీలోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు.  మరి అక్కడ ఏ రకంగా విజయాన్ని అందుకుంటాడో చూడాల్సి ఉంది. మొత్తానికైతే హీరోగా, విలన్ గా తనను తాను ప్రెజెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: