తెలుగు ఇండస్ట్రీ అంతా ఒక వైపు దిల్ రాజు ఒక వైపు అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ సంక్రాంతికి చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలు విడుదల అవ్వబోతూ ఉన్న సంగతి తెల్సిందే.

ఆ సినిమాలను కాదని ఒక తమిళ హీరో సినిమాకు ఆయన థియేటర్లు ఇవ్వడం పెద్ద కాక రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ థియేటర్లు దిల్ రాజు ఆధ్వర్యంలో నే ఉన్నాయి. చాలా థియేటర్ల ను ఆయన నాలుగు అయిదు నెలల క్రితమే తన వారసుడు సినిమా కోసం బుక్ చేయడం అయితే జరిగింది. ఆ సినిమా కు అంత సీన్ లేదు అంటూ ఎంత మొత్తుకున్నా కూడా వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమా ల కు పోటీ అన్నట్లుగా వారసుడు సినిమాను విడుదల చేయడం అయితే జరుగుతుంది. సంక్రాంతి పోటీలో తన సినిమాను నిలిపినట్లుగానే ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా తన సినిమా ను విడుదల చేయబోతున్నాడని తెలుస్తుంది..

గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా రూపొందిన శాకుంతలం సినిమా ను ఈ సమ్మర్ లో విడుదల చేయాలని అయితే అనుకున్నారు. కానీ తాజాగా వచ్చే నెలలోనే సినిమాను విడుదల చేసే విధంగా దిల్ రాజు ఒత్తిడి చేసి మరీ గుణశేఖర్ ని ఒప్పించాడని అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి లో విడుదల కాబోతున్న సినిమా లకు పోటీ అన్నట్లుగా విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం . ఫిబ్రవరి లో సమంత సినిమా శాకుంతలం సినిమా ను విడుదల చేయాలని ముందుగా అయితే అనుకోలేదు. కానీ దిల్ రాజు పట్టు బట్టి మరీ విడుదల చేయడం ఏంటో అనేది మాత్రం వారికే తెలియాలి. ఈ నెలలో పెద్ద హీరోలతో పోటీ పడ్డ దిల్ రాజు వచ్చే నెలలో చిన్న హీరోలతో కూడా దిల్ రాజు పోటీ పడనున్నాడు . మరి శాకుంతలం సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: