ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రాలలో ప్రాజెక్ట్ -K  చిత్రం కూడా ఒకటి ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తున్నది. కీలకమైన పాత్రలో అమితాబచ్చన్ కూడా నటిస్తూ ఉన్నారు. అలాగే మరి కొంతమంది నటీనటులు సైతం ఇందులో నటిస్తున్నారు. ప్రస్తుత కాలానికి ముందుగా భవిష్యత్తులో జరగబోయే కథ అంశంతో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ సరికొత్త లుక్కులు కనిపించబోతున్నారు.


ఇక మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ అంశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లను బట్టి మహాభారతంలోని కాన్సెప్ట్ ని ఫ్యూచర్ స్టోరీస్ కి రూపొందించి ఈ కథని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా కోసం ఉపయోగించే కార్లను కూడా కొత్తవి గాని చూపించబోతున్నట్లు గతంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.ప్రతి అంశాన్ని కూడా ఇప్పటివరకు ఎవరు చూడని విధంగానే ప్రాజెక్ట్ -K  లో చూస్తారని తెలిపారు.


అందుకే ఈ సినిమా నుంచి ఎలాంటి లీకుడు వీడియోలు ఫోటోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు చిత్ర బృందం. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాకు షెడ్యూల్ మళ్లీ స్టార్ట్ కాబోతోంది అనే విషయాన్ని డైరెక్టర్ తెలియజేశారు. అది కూడా ఇంస్టాగ్రామ్ లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలోని వెహికల్స్ కి వాడే స్పీడోమీటర్ ఫోటో ని షేర్ చేయడం జరిగింది. అది కూడా ప్రాజెక్ట్ -K  అంటూ ట్యాగ్ చేసి మరీ కిందన కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: