తెలుగులో  బాలకృష్ణ, చిరంజీవి ఈ సంక్రాంతికి హిట్స్ కొట్టి తమ స్టామినా ఏ మాత్రం కూడా తగ్గలేదని నిరూపించు కున్నారు.

అయితే సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్, నాగార్జున మాత్రం రేసులో వెనుకబడి ఉన్నారని తెలుస్తుంది... వీరు కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు.. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్లను నమ్ముకుని సినిమాలు చేస్తున్నారట.

ఇక వీరిలో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమాపై అదిరిపోయే అంచనాలు కూడా ఉన్నాయి.. వెంకీ తన కెరీర్ లోనే మైల్ స్టోన్ సినిమా అయినా 75వ సినిమాను హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రకటించాడని సమాచారం.. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయని తెలుస్తుంది.. 'సైంధవ్' అనే టైటిల్ ను కూడా ఖరారు చేయడమే కాకుండా వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని సమాచారం.

ఒక పవర్ ఫుల్ పాత్ర లో వెంకీ నటిస్తున్నట్టు తెలుస్తుంది.. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడట. కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది.

ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇప్పటికే విడుదల చేసారు.. ఈమె ఎప్పుడో షూట్ లో కూడా జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా మరో పాత్రను పరిచయం చేసారట మేకర్స్ .. సెకండ్ హీరోయిన్ గా అందాల భామ రుహానీ శర్మ ను ఖరారు చేశారని తెలుస్తుంది... చిలసౌ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ సైంధవ్ సినిమాలో డాక్టర్ రేణు అనే పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం... ఇలా శైలేష్ కొలను ఒక్కో పాత్ర పరిచయం చేస్తూ మరింత క్యూరియాసిటీ ని అయితే పెంచుతున్నాడు.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వెంకటేష్ కు ప్రతినాయకుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నాడని తెలుస్తుంది.శైలేష్ కొలను ఈ సినిమాతో వెంకటేష్ కు మంచి హిట్ ఇస్తాడని అందరూ నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: