అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టైలిష్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించగా ... ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. హిప్ హాప్ తమిజ సంగీతం అందించిన ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

ఈ సినిమాలో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించడంతో ... ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత గా పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు మినహాయిస్తే ఆ తర్వాత రోజుల్లో కలెక్షన్ లు భారీగా తగ్గిపోయాయి.

ఇలా ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లు చెప్పుకోదగ్గ రీతిలో రాకపోవడంతో ఈ మూవీ ని అతి త్వరలోనే "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని మే 19 వ తేదీ నుండి సోనీ లీవ్ "ఓ టి టి"  ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తుంది.  ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: