పాన్ ఇండియా ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోంది.ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. నిన్న మొన్నటి దాకా ఎన్నో వివాదాలకు కేరాఫ్ గా మారిన ఆదిపురుష్ సినిమా ఇప్పుడు మాత్రం వివాదాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. విజువల్ ఫీస్ట్ మేనియా ఏంటో అందరికీ కూడా చిన్న శాంపిల్ గా రీలీజ్‌కు ముందే చూపించింది. త్రీడీ వరల్డ్ మ్యాజిక్‌ ఏంటో రీసెంట్‌గా కొంత మంది రిపోర్టర్లకు తెలిసేలా చేసింది ఈ సినిమా. ఆదిపురుష్ త్రీడీ ట్రైలర్‌ను వారికి చూపించి.. వారిని నోరుళ్ల బెట్టేలా చేసింది ఈ మూవీ.ఈ మాసివ్ విజువల్ వండర్ మూవీని వచ్చే నెల (జూన్ 16న) పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. అయితే అంతకు ముందే అంటే జూన్ 7 నుంచి జూన్ 18 దాకా జరగనున్న ట్రిబెకా ఫెస్టివల్లో ఈ ప్రీమియర్ గా ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే.ఇక అందువల్ల ఈ మూవీ ప్రమోషన్స్ చాలా గట్టిగా జరుగుతున్నాయి.


ఇప్పటికే చిత్రయూనిట్ అంత కూడా ఇంటర్వ్యూస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కోసం ఫ్యాన్స్ రాంగంలోకి దిగారు. ఈ సినిమా కోసం జై శ్రీరామ్ రాలీ నిర్వహించనున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్ . ప్రతి శనివారం, ఆదివారం ప్రధాన నగరాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్.తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ వరంగల్ హైదరాబాద్ సిటీస్ లో ఈ బైక్ ర్యాలీ అనేది జరగనుంది. ఇంకా అలాగే తిరుపతి శ్రీకాకుళం జిల్లాలలో ఈ బైక్ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించడానికి రెడీ అయ్యారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇంకా అలాగే మరికొన్ని నగరాల్లో కూడా ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. ఇంకా అలాగే ఆదిపురుష్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహించనున్నారు. ఇందు కోసం గాను భారీ ఏర్పాట్లు కూడా చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: