పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న బిగ్గెస్ట్ సినిమాలలో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి.ఈ సినిమా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫాన్స్ .అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఇక నిన్న మొన్నటి వరకు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ సినిమా ఇప్పుడు మాత్రం అందరిని ఆకట్టుకునే విధంగా కనబడుతోంది. 

విజువల్ ఫిస్ట్ మానియా ఏంటో అందరికీ చిన్న శాంపిల్ గా రిలీజ్ కి ముందే చూపించారు. త్రీడీ వరల్డ్ మ్యాజిక్ ఏంటో రీసెంట్గా కొంతమంది రిపోర్టర్లకు తెలిసేలా చేసింది ఈ సినిమా ట్రైలర్. ఇక ఆది పురుష్ త్రీడీ ట్రైలర్ను వారికి చూపించి వారందరి నోరులను మూయించేలా చేసింది ఈ సినిమా ట్రైలర్. ఇక ప్రభాస్ నటిస్తున్న ఈ మాసివ్ విజువల్ వండర్ సినిమా వచ్చేనెల 16న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నారట.

అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నో తిరుపతిలో నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల జూన్ 6న ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ అంతా కూడా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నారు. అంతేకాదు ఇటీవల ఆది పురుష్ సినిమా కోసం ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఈ సినిమా కోసం జై శ్రీ రామ్ ర్యాలీలు సైతం నిర్వహిస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అంతేకాదు ప్రతి శనివారం ఆదివారం బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఇక ప్రభాస్ కెరియర్ లోనే ఈ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ గా నిలబోతుందని నమ్ముతున్నారు ప్రభాస్ అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: