ఇండస్ట్రీ పూర్తిగా మర్చిపోయిన ఒకనాటి చాక్లెట్ బాయ్ పిలవబడిన తరుణ్ కే ‘బిగ్ బాస్’ సీజన్ 4 పూర్తి గుర్తింపు తీసుకు రాబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఒకవైపు లాక్ డౌన్ కొనసాగుతూనే ఉండగా స్టార్ మా వర్గాలు తమ బిగ్ బాస్ స్సేజన్ 4 కు సంబంధించిన హౌస్ మేట్స్ ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 


ఈ లిస్టులో ఒకప్పటి యూత్ క్రేజీ స్టార్ తరుణ్ ఎంపిక అయినట్లు తెలుస్తోంది. తరుణ్ ను ఈషో లోకి వచ్చే విధంగా ఒప్పించడానికి భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో వరస విజయాలతో క్రేజీ హీరో స్థాయిలో ఒక వెలుగు వెలిగిన తరుణ్ ఆతరువాత పరిస్థితులలో తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయాడు. 


ఆమధ్య ఒకటి రెండు సినిమాలలో తిరిగి నటించినా అతడి ప్రయత్నాలు సఫలం కాలేదు. తరుణ్ తో పాటుగా సింగర్ మంగ్లీ జాహ్నవీ దాసెట్టి వర్షిణి లతో పాటు యాంకర్ శివ కూడ ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ‘బిగ్ బాస్ 4’ సీజన్ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడానికి నాగార్జున కూడ తన అంగీకారం తెలపడంతో ఈకార్యక్రమాన్ని జూలై 5 నుండి ప్రారంభించాలని స్టార్ మా చాలగట్టి ప్రయత్నాలు చేస్తోంది.


అయితే లాక్ డౌన్ ఆ సమయానికి పూర్తిగా తొలిగించినప్పటికీ ప్రస్తుతం కరోనా పరిస్థితులు వల్ల అనుసరిస్తున్న భౌతిక దూరంతో సుమారు 16 మంది ఒకే ఇంటిలో 100 రోజులు కలిసి ఉండటానికి ఎంతవరకు ప్రభుత్వాలు అంగీకరిస్తాయి అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే ప్రభుత్వ అనుమతులు వస్తాయి అన్న నమ్మకంతో ఈషో నిర్వాహకులు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇప్పటికే ఒక భారీ ఇంటి సెట్ నిర్మాణ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వరుణ్ సందేశ్ కు ‘బిగ్ బాస్ 3’ మళ్ళీ గుర్తింపును తీసుకు వస్తే అదే గుర్తింపు తనకు కూడ వస్తుందని తరుణ్ ఆశిస్తున్నాడు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: