బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి విడాకుల వ్యవహారం ప్రస్తుతం మీడియా సర్కిల్స్ లో బాగా హాట్ హాట్ గా నానుతున్న సంగతి తెలిసిందే. నవాజ్ తన భార్య ఆలియా తో కొద్దిరోజులుగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆలియా తనకు భర్త నుంచి విడాకులు మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించడంతో పాటు... తనకు కూడా భరణం మంజూరు చేయించాలని కోరారు. ఈ క్రమంలోనే ఆమె ఆయనకు లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. ఇవి వాట్సాప్, మెయిల్ ద్వారా పంపినట్టు సమాచారం. ఇదిలా ఉంటే పలువురితో ఆలియాకు ఎఫైర్లు ఉన్న కారణంగానే ఆమె భర్త నుంచి విడాకులు కోరింది అన్న ప్రచారం జరుగుతోంది.
దీనిపై ఆమె చాలా ఘాటుగా స్పందించారు. తనకు ఎవరితోనూ విడాకులు లేవని... అసలు వాస్తవాలు అని వెల్లడి చేసేందుకే తాను సోషల్ మీడియా ఖాతాను తెరిచాను అని చెప్పారు. ఇక నవాజ్ తనను చాలా కాలంగా పట్టించుకోవడం మానేశాడు అని ఆమె విమర్శించారు. ఒకసారి నవాజ్ మరో నటుడు మనోజ్ బాజ్ పాయ్తో కలిసి ఇంటికి వచ్చి అతడి ముందు కూడా తనను తీవ్రంగా అవమానించాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ దంపతులు 2009లో వివాహం చేసుకోగా వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు కాగా సిద్ధిఖికి ఆలియా తో రెండో పెళ్లి కావడం విశేషం.
ఇక ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తీవ్రంగా ఉన్నాయని.. వీరు కలిసి ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదని.. వీరు విడిపోవాన్న నిర్ణయానికి కూడా వచ్చేశారని ఆలియా తరపున న్యాయవాది మీడియాకు వెల్లడించారు. ఇటీవలే నవాజుద్దీన్ చిన్న సోదరి, తల్లి కూడా మృతి చెందారు. దీంతో ఆయన ముజఫర్ నగర్ జిల్లాలోని తన సొంత ఇంట్లోనే ఉంటున్నాడట. మరి ఈ విడాకుల వ్యవహారం ఎలా మలుపులు తిరుగుతుందో ? చూడాలి.