ఎన్నో ఏళ్ల తర్వాత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో మంచి విజయం సాధించిన పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్  సినిమాతో  రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. కాగా ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా  వైరస్ కారణంగా షూటింగులు అన్నీ కూడా వాయిదా పడడంతో ఈ సినిమా విడుదల కాస్త వాయిదా పడుతూ వస్తుంది. దీంతో ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.



 ఇక పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ప్రస్తుతం సంచలనంగా మారిపోతుంది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి అభిమానులు అందరూ కూడా ఆకర్షిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు అన్న విషయం తెలిసిందే. పలువురు హీరోయిన్లు పేరు తెర మీదికి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ ఎవరు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నారన్న  దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. అటు చిత్ర బృందం కూడా దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.




 కానీ ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ సినిమా కోసం వచ్చే నెల నుంచి కెమెరా ముందుకు వస్తున్నట్లు నటి శృతిహాసన్ తెలిపింది. పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తోంది అని క్లారిటీ వచ్చింది. ఇటీవల ఇంస్టాగ్రామ్ లో నెటిజన్ల తో ముచ్చటిస్తూ ఉన్న సమయంలో... ఈ విషయాన్ని చెప్పింది శృతిహాసన్. వచ్చేనెల నుంచి వకీల్ సాబ్ కోసం కెమెరా ముందుకు వెళ్లి పోతున్నట్లు తెలిపింది. కాగా ఇప్పటి వరకు  వకీల్ సాబ్ చిత్రబృందం నుంచి మాత్రం సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న విషయం మాత్రం బయటకు రాలేదు అన్న విషయం తెలిసిందే . ఇక  ఇప్పటికే పవన్ కళ్యాణ్ శృతి హాసన్ కలిసి గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కాటమరాయుడు సినిమాలో  కూడా నటించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: