టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గడచిన రెండేళ్ల లో డీజే, అలానే నాపేరు సూర్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా వాటిలో డీజే మూవీ ఎబోవ్ ఎవరేజ్ విజయాన్ని అందుకోగా ఆపై వచ్చిన నా పేరు సూర్య మూవీ ఫ్లాప్ గా నిలిచి కెరీర్ పరంగా అల్లు అర్జున్ ని కొంత ఇబ్బందుల్లోకి నెట్టింది. అనంతరం తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో చేయడానికి సిద్దమైన అల్లు అర్జున్, ఆయనతో కలిసి చేసిన అలవైకుంఠపురములో సినిమా ద్వారా ఈ ఏడాది సంక్రాంతి సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకుంది. అలానే ఇందులోని పాటలు కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని జాతీయ స్థాయిలో మంచి పేరు దక్కించుకున్నాయి.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు టాక్. ఇటీవల ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం అయింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనపడుతోంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కు సంబంధించి పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో వరుస సక్సెస్ ల దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమా చేయనున్న అల్లు అర్జున్, ఆపై టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారని అంటున్నారు.

ఇప్పటికే వీరిద్దరి కాంబో సినిమా విషయమై టాలీవుడ్ కి చెందిన ఒక బడా నిర్మాత సినిమా చేయడానికి సిద్ధం అయ్యారని, అలానే వారిద్దరి సినిమాకి సంబంధించి కథా రచన కూడా ప్రారంభం అయినట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ విషయంలో బిజీగా ఉన్న రాజమౌళి, ఆ తరువాత మహేష్ తో సినిమా చేస్తారని, అది మధ్యలో ఉన్న సమయంలో అల్లు అర్జున్ మూవీ అనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్. అయితే ప్రస్తుతానికి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, తొలిసారిగా అల్లు అర్జున్, రాజమౌళి ల కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ మూవీ రావడం ఖాయం అనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: