టాలీవుడ్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని మంచి సినిమాలు చేస్తున్న హీరో నితిన్.. ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ చాల రోజుల తర్వాత ఆ హిట్ ను ఆస్వాదిస్తున్నాడు. నిజం చెప్పాలంటే నితిన్ కి ఈ రేంజ్ హిట్ చాల రోజుల తర్వాత వచ్చిందని చెప్పాలి.. ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే తర్వాత ఆయనకు పెద్ద హిట్ ఈ సినిమా అని చెప్పాలి.. ఇక ఆ సినిమా హిట్ జోష్ లో ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు..

తొలి సినిమాగా వచ్చిన తొలిప్రేమ హిట్ కాగా, అఖిల్ మిస్టర్ మజ్ను కూడా మంచి హిట్ సాధించింది.. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమా కూడా మంచి హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని అయన డిసైడ్ అయ్యారట..అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో నితిన్ కి కొంత కంగారు మొదలైందట.   ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో నితిన్ కి టెన్షన్ మొదలైందట.ఇప్పటికే  ‘సోలో బ్రతుకే సో బెటర్‍’ థియేటర్లలో విడుదల అవుతుంది. అయితే నితిన్ ఆ ధైర్యం చేయలేకపోతున్నాడట.

థియేటర్లు తెరిచినా కానీ మునుపటిలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, అప్పటి మాదిరిగా కలక్షన్లు వస్తాయా అనేది అనుమానంగా వుంది. ఈ చిత్రానికి బడ్జెట్‍ కూడా బాగా అవడంతో ఒక నాలుగైదు కోట్లు లాభం వచ్చేలా ఓటిటి డీల్‍ ఏదైనా వస్తే ఇచ్చేసి ఆలోచనలో ఉన్నాడట. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్స్ గోల వుండదు కాబట్టి నిర్మాతకు ఎలాంటి చీకు చింత వుండదు. అలాగే రంగ్‍ దేకు కూడా డీల్‍ సెట్‍ చేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి ఈ సినిమా భవిష్యత్ ఏమవుతుందో చూద్దాం..



మరింత సమాచారం తెలుసుకోండి: