ఇప్పటికే కన్నడ సినీ ఫ్యాన్స్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మీద చాలా కోపంగా ఉన్నారు.కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేయడానికి చాలా మంది స్టార్లు ఆసక్తి చూపుతున్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తెలుగు స్టార్ హీరోలతో కలిసి పని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే ప్రశాంత్ పై కన్నడిగులు మండిపడ్డారు. కన్నడలో పేరు సంపాదించగానే ఇక్కడ హీరోలు కనిపించకుండా పోయారంటూ అతడిని ట్రోల్ చేశారు.గెట్ లాస్ట్ ప్రశాంత్ అంటూ ట్విట్టర్ లో ట్యాగ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు.
ఆ తరువాత వ్యవహారం సద్దుమణిగింది. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేయగానే.. మరోసారి రచ్చ మొదలైంది.కన్నడ ఇండ్రస్టీ లో స్టార్ హీరోలు ఉన్నప్పటికీ.. తెలుగు హీరోలతో సినిమాలు చేయాల్సిన అవసరం ఏంటని ఇప్పుడు ప్రశాంత్ నీల్ ని సోషల్ మీడియాలో కన్నడ అభిమానులు ప్రశ్నిస్తూ.. అతడిపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు...ఇక ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమాలో మన డార్లింగ్ ని ఓ మాఫియా డాన్ గా చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ..!!