మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధీరం. టాలీవుడ్ ప్రఖ్యాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దానయ్య ఎంతో భారీగా ప్రతిష్టాత్మక లెవల్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్  ని అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా మాటలను అలానే కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. స్వాతంత్రోద్యమానికి పూర్వం జరిగిన కథ గా  రూపొందుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా యొక్క క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరణ ఎంతో వేగవంతంగా జరుగుతోంది. తెలుగు సహా పలు ఇతర భారతీయ భాషల్లో పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో లేడీ స్కాట్ గా, అలానే స్కాట్ గా హాలీవుడ్ నటులు నటిస్తుండగా ఒలీవియా మోరిస్, ఆలియాభట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

నిజానికి ఈ సినిమాలో హీరోలుగా ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఎంతో అద్భుతంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్న దర్శకధీరుడు రాజమౌళి నిజమైన హీరో అని, తన మీద మనసులో మెదిలిన ఒక పాయింట్ ని కథగా రూపొందించి ఆపై ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్న రాజమౌళి తప్పకుండా ఈ మూవీ ద్వారా భారీ సక్సెస్ అందుకుని తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా విశ్వవ్యాప్తం చేయడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సముద్రఖని, శ్రియ శరణ్, అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాపై దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: