పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడేళ్ళ తరువాత అతి త్వరలో వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ఇటీవల పూర్తి అయింది. 
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తో కలిసి బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు మగువ మగువ అనే సాంగ్ ఇటీవల రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు మూవీ పై బాగా అంచనాలు కూడా క్రియేట్ చేసాయి. పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తున్న ఈ మూవీ ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి విజయం అందుకున్న కోర్ట్ డ్రామా మూవీ పింక్ కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. అంజలి, నివేదా థామస్, అనన్య, ప్రకాష్ రాజ్, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్ర చేస్తున్నారు. 

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ మూవీ నుండి సత్యమేవ జయతే పల్లవితో సాగె సెకండ్ లిరికల్ సాంగ్ ని రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు యూనిట్ కొద్దిసేపటి క్రితం అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. దీనితో ఒక్కసారిగా పవర్ స్టార్ ఫ్యాన్స్ లో అమితానందం వెల్లివిరుస్తోంది. దేశభక్తి గీతంగా సాగే ఈ పాటకు శ్రోతలను ఆకట్టుకునే విధంగా లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి ఎంతో అద్భుతంగా లిరిక్స్ రాసినట్లు సమాచారం. కాగా ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 9 న రిలీజ్ కానుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: