సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు. గత ఏడాది సంక్రాతి పండుగ కానుకగా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. సీనియర్ నటి విజయశాంతి దాదాపుగా 13 ఏళ్ళ తరువాత ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చారు. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇక దీని తరువాత ప్రస్తుతం మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట.

యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక దీని తరువాత ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఇటీవల రాజమౌళి అధికారికంగా ప్రకటన కూడా చేసారు. సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందించనుండగా విజయేంద్రప్రసాద్ దీనికి సంబందించిన కథ రూపకల్పన చేస్తున్నారు. 

అయితే ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టనుండడం, అలానే ఆ మూవీ రిలీజ్ కావడానికి దాదాపుగా ఆరు నెలలకు పైగా టైం ఉండడంతో ఈలోపు మహేష్ సర్కారు వారి పాట తో పాటు మరొక సినిమా చేయనున్నారని, అలానే ఆ మూవీని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే అది ప్రస్తుతం వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదని, ఇటీవల విజయేంద్రప్రసాద్, రాజమౌళి తో పాటు మహేష్ కి కూడా ప్రత్యేకంగా ఒక కథ వినిపించారని, అది ఎంతో నచ్చిన మహేష్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారని, అది అతి త్వరలో పూర్తి కాగానే అందులోని క్యారెక్టర్ కోసం మహేష్ సిద్దము కానున్నారని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే అనిల్ రావిపూడి తో సూపర్ స్టార్ మహేష్ ఇప్పట్లో సినిమా చేసే ఛాన్స్ లేనట్లే అంటున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక న్యూస్ వెలువడాల్సి ఉంది....!!








 

మరింత సమాచారం తెలుసుకోండి: