ఇస్మార్ట్ శంకర్ సినిమా తో తన కెరీర్ నీ గాడిలో పెట్టుకున్నాడు హీరో రామ్ పోతినేని. అంతకు ముందు వరుస ప్లాపులతో సతమతం అయిన రామ్ ఈ సినిమాతో ఒక్కసారిగా మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన చేసిన రెడ్ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దాంతో ఈ సారి రెగ్యులర్ దర్శకుడితో కాకుండా ఓ తమిళ దర్శకుడితో సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో తమిళంలో మాస్ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన లింగుస్వామి తో ఆయన సినిమాను ఓకే చేసుకున్నాడు. తెలుగులో లింగుస్వామి డైరెక్ట్ గా సినిమాలేవీ చేయకపోయినా పందెంకోడి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత ఆయన తమిళంలో చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఏ హీరో కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దాంతో తెలుగు వైపుకు మొగ్గు చూపిన ఆయనకు రామ్ పోతినేని పిలిచి మరి అవకాశం ఇచ్చాడు.

ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు తెలుస్తోంది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కబోతుంది అని అంటున్నారు. ఈ సినిమా కోసం లింగుస్వామి ఏకంగా ఆరు కోట్ల రెమ్యునరేషన్ అమ్ముకున్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా రామ్ కూడా ఈ సినిమా ద్వారా భారీ పారితోషికాన్ని అందుకున్నారట. 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడం తోపాటు వాటాల్లో చిన్న మొత్తాన్ని కూడా పంచుకుంటున్నారట. అవి మూడు కోట్ల దాకా వస్తాయి అంటున్నారు. ఏది ఏమైనా రామ్ సినిమా కి 22 కోట్ల రూపాయలు పారితోషికంకే వెళుతన్నాయి. ఈనేపథ్యంలో రామ్ కి అంత రేంజ్ ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు. వరుస ఫ్లాప్ లలో ఉన్న రామ్ అన్ని డబ్బులు వెనక్కి తేగలుగుతాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: