రేణు దేశాయ్ తెలుగు బుల్లితెరపై కొన్ని టీవీ షో లలో కనిపిస్తూనే, టీవీ సీరియల్ ప్రమోషన్ లో కూడా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే. దానితో పాటు రేణూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటారు. క‌రోనా వేళ రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియా ద్వారా ఎంతో మందికి తన‌కు తోచిన స‌హాయం అందించారు. అంతే కాకుండా తాను త్వ‌ర‌లో ఓ స్వ‌చ్చంద సంస్థ‌ను కూడా ప్రారంభిస్తున్న‌ట్టు రేణూదేశాయ్ ఇటీవ‌లే వెల్ల‌డించారు. మ‌రోవైపు వీలు దొరికినప్పుడల్లా రేణూ దేశాయ్ సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి అభిమానుల‌తో ముచ్చ‌ట్లు పెడ‌తారు. త‌న సినిమాల గురించి మ‌రియు పిల్ల‌ల గురించి లైవ్ లో ఎక్కువ‌గా చెబుతుంటారు.

అయితే రేణూ దేశాయ్ లైవ్ లో ఉన్న సమయంలో చాలామంది అకీరానందన్ ఎక్కడ..? అతన్ని ఒకసారి పిలవండి..? చూపించండి అంటూ ప్రశ్నలు వేస్తుంటారు. దానికి రేణూ దేశాయ్ అకీరానందన్ కు ఇలా లైవ్ లో కనబడడం అంతగా ఇష్టం ఉండదని మరియు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటం తనకు నచ్చదు అని సమాధానమిస్తారు. అలాగే  అకీరానందన్ ఫోటోలను కూడా ఎక్కువగా తన సోషల్ మీడియాను అకౌంట్లో పోస్ట్ చేయ‌రు. కానీ కొద్దిరోజుల క్రితం రేణూదేశాయ్ అకీరా నంద‌న్ ఫోటోను షేర్ చేస్తూ నేను ఎలాంటి సందర్భంలో ఉన్నా... ఏ బాధలో ఉన్నా...నన్ను నవ్వించి ఆనందంగా ఉంచే ఏకైక వ్యక్తి అకీరా అని చెప్పుకొచ్చారు.

కాగా తాజాగా రేణూ దేశాయ్ అకీరానందన్ తో దిగిన సెల్ఫీ ఫోటోను ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ ఫోటోకు అద్భుతమైన వ్యక్తి నావెన‌క‌ ఉన్నప్పుడు నన్ను ఎవ‌రూ బాధ‌పెట్ట‌రు అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ఫోటోకు నెటిజన్ లు ఎలాంటి కామెంట్లు పెట్టకుండా కామెంట్ ఆప్షన్ ను రేణూ దేశాయ్ డిసేబుల్ చేశారు. అయితే రేణూ దేశాయ్ త‌న‌ను ఎవ‌రూ బాధించ‌లేరు అని రాయండంతో ఎలాంటి కామెంట్లు చూడాల్సి వ‌స్తుందో అని ముందుగానే డిసెబుల్ చేసిన‌ట్టు క‌నిపిస్తుంది. దానికి కార‌ణం గ‌తంలోనూ తాను ర‌క‌ర‌కాల కామెంట్ల వ‌ల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్న‌ట్టు రేణూ దేశాయ్ ఓ ఇంట‌ర్యూలో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: