రవితేజ హీరోగా నటించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా కావడంతో ఈ సినిమా పై ఎంతో ఆసక్తి నెలకొంది. రవితేజ కూడా అప్పుడే హీరోగా చేయడం కొత్త కావడం తో ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ సినిమా బరిలోకి దిగి సూపర్ హిట్ ను అందుకుంది. హీరో హీరోయిన్ లు సూసైడ్ చేసుకునే సీన్ తో ఓపెన్ చేసి ఈ సినిమాపై ఎంతో క్యూరియాసిటీని పెంచాడు దర్శకుడు.

ఇక రవితేజ జోడిగా ఈ సినిమా లో నటించింది తను రాయ్. ఈ సినిమా ద్వారానే సినిమా పరిశ్రమకి పరిచయమైన ఈమె ఆ తరువాత మంచి తెలుగు సినిమాల్లో అవకాశాలు పొందింది. ఆనందం, మనసంతా నువ్వే, సత్యం వంటి సినిమాల్లో నటించిన కూడా ఈమె స్టార్ కాలేకపోయింది. వాస్తవానికి హీరోయిన్ లు స్టార్ లుగా ఎదగాలంటే ఎంతోకొంత అదృష్టం ఉండాలి కానీ చాలామంది హీరోయిన్ లు ఈ అదృష్టం అనేది కలిసి రాకుండా కొన్ని సినిమాలతోనే భారీ పరాభవాన్ని మూటగట్టుకుని ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోతున్నారు.

వారిలాగానే తమిళ మలయాళ కన్నడ చిత్రాల్లో తన అదృష్టం పరీక్షించుకున్న తను తర్వాత సినిమాల నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆమె చిన్ననాటి స్నేహితురాలి ని పెళ్లి చేసుకొని ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని గడుపుతుంది. ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ అయితే లేదు కానీ తను మాత్రం సినిమాలు చేయకపోవడం ఆమె అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. అందంతో పాటు అభినయం కూడా ఉన్న ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసి రాలేదు. చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయిపోయింది అయిపోయింది. స్పెషల్ సాంగ్స్ లో కూడా ఆమె ప్రేక్షకులను మైమరిపించారు. ఇటీవలే ఆమె మంజుల కథ అనే  మూవీలో ప్రాధాన్యం గల పాత్రలో నటించారు. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు.  మలయాళం లో కొన్ని సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: