తెలుగు చలన చిత్ర పరిశ్రమలో
రోజా కు ఉన్న క్రేజ్ ఏ
హీరోయిన్ కు లేదని చెప్పాలి. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న అలనాటి
హీరోయిన్ లు ఎవరైనా ఉన్నారా అంటే ఆమె ఒక
రోజా అని మాత్రమే చెప్పొచ్చు. ఫైర్ బ్రాండ్ గా సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకుని రాజకీయాల్లో కూడా అదే తరహా దూకుడును కొనసాగిస్తు రాష్ట్ర రాజకీయాల్లో ఆమె హాట్ టాపిక్ గా మారారు. తాజాగా ఆమె గురించి ఓ రాజకీయ నాయకుడు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
రోజా ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆమె జోలికి వెళ్లాలంటే మగవాళ్ళు సైతం వణికిపోతారు.
స్వతహాగా ఆమెకు ధైర్యం, మాట తీరు ఎక్కువే. అందుకే ఆమెను ఇష్టపడనివారు ఎంతమంది ఉంటారో ఇష్టపడే వారు కూడా అంతకంటే ఎక్కువ ఉంటారు. రోజా తో 1991 లో
ప్రేమ తపస్సు అనే
సినిమా చేశారు ప్రముఖ రాజకీయ నాయకులు
టిడిపి సీనియర్ నేత శివప్రసాద్. ఒక కొత్త
అమ్మాయి ని ఇంట్రడ్యూస్ చేయాలని చాలా చోట్ల ఆరు నెలల పాటు
హీరోయిన్ వెతికారు కానీ ఫైనల్ గా
శ్రీ లత అనే అమ్మాయిని సెలక్ట్ చేశాము అన్నారు. ఆ తర్వాత ఆమె పేరును
రోజా గా
మార్చి ఆ చిత్రంలో వెండితెరకు పరిచయం చేశామని చెప్పారు.
రోజాకు ట్రైనింగ్ ఇచ్చి అన్ని పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత
సినిమా షూటింగ్ లోకి పంపించాము అన్నారు. ఈ చిత్రంలో
నిర్మాత పోకూరి బాబూరావు ను కూడా విలన్ గా చేయించాము. ఒక బాధ్యత తీసుకుని
రోజా ను
హీరోయిన్ గా అందరికీ చూపించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత
రోజా సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే.
హీరోయిన్ గా ఎన్నో పెద్దపెద్ద సినిమాలు చేసి స్టార్
హీరోయిన్ ల సరసన నటించి తనకంటూ మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ప్రస్తుతం న్యాయనిర్ణేతగా పలు షో లకు వ్యవహరిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. మరి భవిష్యత్తులో ఆమె తెలుగు
సినిమా తెరపై ఇలాంటి ఈ పాత్రను పోషిస్తుంది చూడాలి.