నేషనల్ క్రష్ రష్మిక మందన నాగ శౌర్య హీరోగా నటించిన 'చలో'  సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటన కూడా సినీ జనం నుండి మంచి మార్కులు పడ్డాయి. దానితో ఈ హాట్ బ్యూటీ కి తెలుగులో వరుస ఆఫర్లు దక్కాయి. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు కు జోడీగా నటించగా. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలోనూ రష్మిక మందన నే హీరోయిన్. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అంతే ఆక్టివ్ గా ఉంటుంది. ఈమధ్య ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా ఒక డైరీ రాస్తున్న విషయం అందరికీ తెలిసిందే. డైరీ అంటే పర్సనల్గా రాసుకొని చదువుకునేది కాదు. తను నిద్ర లేచి రోజు మొదలు పెట్టినప్పటి నుండి పడుకునే వరకు తాను చేసిన పనులన్నింటినీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది. దీనినే రష్మిక ముద్దు గా డైరీ అని పిలుచుకుంటుంది. అందులో భాగంగా జూలై 29 వ తేదీన తాను ఏం చేసిందో తన డైరీ ద్వారా తెలియజేసింది. ఉదయాన్నే లేచాను..తిన్నాను..టీవీ చూశాను..మళ్లీ తిన్నాను..ఆరా తో కొంత సమయం ఆడుకున్నాను.


 మళ్లీ తిన్నాను..పడుకున్నాను. నాకు ఇక అదే పని అవుతుంది.  ప్రతి రోజులాగే ఈ రోజు కూడా చేశాను. నవ్వుకోడానికి నాకు నేను చాలు అయితే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నా కూడా నా హెయిర్ బ్యాండ్ మిస్ అవుతూనే ఉంది. ప్రపంచంలో అందరూ ఇలానే ఉంటారా అని ఆశ్చర్యపోతూ ఉంటాను. ఈ సంవత్సరంలో నేను బాధపడుతున్న విషయం ఇదే. ఎప్పుడు అది ఎక్కడ ఎలా మిస్ అయిందా అని ఇళ్లంతా వెతుకుతూ ఉంటాను. కానీ ఆ పని చేసింది ఆరా అనుకుంటున్నాను. ఈ విధంగా రష్మిక మందన చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: