ఇక ప్రి రిలీజ్ వేడుకలో నిర్మాత తను నిర్మించిన సినిమా కనుక ఆడకుంటే ఇకపై సినిమాలే నిర్మించనని.. ఇండస్ట్రీకి కూడా గుడ్ బై చెప్పేస్తానని షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సంచలన వ్యాఖ్యలు ఇంకా మంగమ శపథాలు చేసిన ఆ నిర్మాత మరెవరో కాదు 'గల్లీ రౌడీ' సినిమా ప్రొడ్యూసర్ ఎంవీవీ సత్యనారాయణ. టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా ఇది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలోని నటీనటులు ఇంకా సిబ్బందితో పాటు ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ లోని అందరూ కూడా పాల్గొన్నారు.ఇక ఈ సందర్భంగా నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.ఈ సినిమాపై ఆయనకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ఇది మొదటి నుండి చివరి వరకు ఎంతో వినోదాత్మకంగా సాగే సినిమా. ఇక ఇప్పటి వరకు కూడా నా జడ్జిమెంట్ అనేది కరెక్ట్ అవుతూ వచ్చింది. ఇక ఈ విషయంలో కూడా అదే నిజమవుతుంది.

గల్లీ రౌడీ ఆడకపోతే ఇకపై సినిమాలు నిర్మించడం మానేస్తానని ఎంవివి సత్యనారాయణ అనడం జరిగింది.కామెడీ సినిమాలు తియ్యడంలో దిట్ట అయిన జి నాగేశ్వర్ రెడ్డి 'గల్లీ రౌడీ' సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించగా.. నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక కోన వెంకట్ అలాగే ఎంవివి సత్యనారాయణ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. చౌరస్తా ఫేమ్ రామ్ ఇంకా సాయి కార్తీక్ ఈ సినిమాకి సంగీతం అందించారు.ఇక ఈ సినిమా ఈ నెల 17 వ తేదీన థియేటర్లలోకి రానుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమా థియేటర్లలో విడుదలవుతున్న అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ సినిమా. ఇక ఈ సినిమా థియేట్రికల్గా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందా అని ఇండస్ట్రీ వర్గాలు వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: