మాస్
రాజా రవితేజ హీరోగా నటించిన
క్రాక్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయనకు ఒక్కసారిగా క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఆయన రెండు సినిమాలను ఒకేసారి చేస్తుండటం విశేషం.
రమేష్ వర్మ దర్శకత్వంలో ఆయన హీరోగా చేసిన ఖిలాడి
సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రస్తుతం ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో
హీరోయిన్ గా డింపుల్ హయాతి నటిస్తుండగా
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ నిలుస్తుంది అని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో అని అందరూ ఎదురు చూడసాగారు. ఇదిలా ఉంటే
రవితేజ నటిస్తున్న మరో
సినిమా రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఇటీవలే మొదలు కాగా ఈ చిత్రం షూటింగ్ కూడా శేరవేగం గా జరుపుకుంటుంది.
శరత్ మండవ అనే దర్శకుడి దర్శకత్వం లో నటిస్తున్న ఈ
సినిమా ఓ
గవర్నమెంట్ ఆఫీసర్ చుట్టూ జరిగే కథ అని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేసి దీని తర్వాత త్రినాధరావు నక్కిన
సినిమా చేయాలని
హీరో రవితేజ భావిస్తున్నాడు.
అయితే
రవితేజ చేస్తున్న కిలాడి
సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ విధమైన వార్తలు గతంలోనే వినిపించగా ఈ చిత్రం తాజా షెడ్యూల్ మొదలవుతున్న ట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించడం తో ఆర్థిక సమస్యలు సద్దుమణిగాయి అని అందరూ అనుకున్నారు కానీ మళ్లీ ఈ
సినిమా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని వార్తలు రావడంతో ఈ
సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు
రవితేజ అభిమానులు.
క్రాక్ లాంటి సూపర్ హిట్ కొట్టిన తర్వాత ఆయన చేసే ఏ
సినిమా అయినా సూపర్ హిట్ అవుతున్న అని ఆశలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ
సినిమా ఇలా అయిపోవడం వారిని ఎంతగానో నిరాశపరుస్తుంది. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేంత వరకు వేచి చూడాలి.