సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. సినిమాను తెరకెక్కించే నేపథ్యంలో ఈ సినిమా నిడివి ఎక్కువగా రావడంతో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారట చిత్రబృందం. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.  

అయితే డిసెంబర్ లో ఎప్పుడు అనేది విడుదల తేదీ ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. పాన్ ఇండియా సినిమా గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ లు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఇటీవలే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఓ పాట విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. దాక్కో దాకా మేక అంటూ ఐదు భాషలలో ఈ పాటను ఒకేసారి విడుదల చేసిన చిత్ర బృందం ఒకేసారి 5 భాషల్లో క్రేజ్ సంపాదించుకోవటం విశేషం.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను కూడా త్వరలోనే విడుదల చేస్తున్నారట సినిమా యూనిట్. ఈ పాటను కూడా మొదటి పాట ను చేసినట్లుగానే ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. దీన్ని బట్టి ఈ సినిమా బృందం చిత్రం పై ఎంతటి గట్టి నమ్మకంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపిస్తుండగా తొలిసారి రగ్డ్ గా కనిపిస్తూ ఉండటం ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: