నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే, ఇప్పటికే నాని హీరోగా నటించిన వి , టక్ జగదీష్ సినిమాలను కరోనా కారణం వల్ల థియేటర్లలో కాకుండా  ఓటిటి లో విడుదల చేశారు, అయితే తన తదుపరి సినిమా అయినా  శ్యామ్ సింగ రాయ్ ను కూడా ఓటిటి లోనే విడుదల చేయబోతున్నారు అంటూ అనేక కథనాలు బయటకు వచ్చాయి, అయితే అలాంటి కథనాలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సినిమా ను థియేటర్ లలోనే డిసెంబర్ 24 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఈ మ ధ్యే ప్రకటించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, మడోనా సుబ్స్టెన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సిని మా నుండి విడుదల అయిన పోస్టర్ లకు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా , ఈ సినిమా పై ఉన్న అంచనాలను మరింత పెంచాయి అని చెప్పవచ్చు. ఇలా జనాల లో ఫుల్ హైప్ క్రియేట్ చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ అయిన సాయి పల్లవి మీద ఒక ప్రత్యేక పాటను చిత్రీకరించాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాటను లవ్ స్టోరీ సినిమా లో సారంగదరియా సాంగ్ ల చిత్రీకరించాలని చిత్ర బృందం ఆలోచన లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి కూడా డాన్స్ ఒక రేంజ్ లో ఇరగదిస్తుంది కాబట్టి ఈ సా రి ఈ సాంగ్ కూడా సూపర్ హిట్ అవుతుంది అని చిత్ర బృందం ఆశ తో ఉన్న ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: