టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు అయిన శివాని రాజశేఖర్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ మధ్యే  ఈ ముద్దు గుమ్మ నటించిన అద్భుతం సినిమా  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అయింది, ఈ సినిమా ఓటిటి మంచి విజయాన్ని సంపాదించుకుంది. ఇలా మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దు గుమ్మ తన అందం తో, నటన తో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇలా మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ నటించిన రెండవ సినిమా  డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ ( ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు) ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీ గా రూపొందిన ఈ సినిమా లో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్ లుగా నటించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని పాట‌లు ప్రజల నుండి మంచి ఆదరణ ను దక్కించుకున్నాయి.

శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించిన రెండవ సినిమా కూడా ఓటిటి లోనే విడుదల కానుంది. అతి త్వర లో ఈ సినిమా సోనీ లీవ్ లో ప్రసారం కానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భం గా ఈ సినిమా నిర్మాత డా. రవి ప్రసాద్ రాజు దాట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మా ఫస్ట్ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కు లుగా వ్యవ‌హరించ‌డం చాలా ఆనందం గా ఉంది. ఫస్ట్‌ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్‌ సినిమా ఇది. ఈ మూవీ సోనిలివ్ ద్వారా మ‌రింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తు న్నాం. గుహ‌న్‌గారి మేకింగ్, అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని నిర్మాత అన్నాడు. ఈ సినిమాకు కె వి గుహన్ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: