రాజమౌళి సృష్టించిన మరో అద్భుతం ఆర్.ఆర్.ఆర్ జనవరి 7న రిలీజ్ కు రెడీ అవుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ చేసి తీరుతామని ఫిక్స్ అయ్యి ఉన్నారు చిత్రయూనిట్. అందుకే ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుండి ఆర్.ఆర్.ఆర్ కోసం ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. మన దగ్గరే కాదు యూఎస్ లో కూడా సినిమాకి సూపర్ బజ్ ఏర్పడింది. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి నటిస్తున్న సినిమాగా ఆర్.ఆర్.ఆర్ యూఎస్ లో 15 రోజుల ముందు నుండే టికెట్స్ ప్రీ సేల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడ 2 మిలియన్ వసూళ్లు కూడా వచ్చాయి. అయితే అమెరికాలో ఒమిక్రాన్ విసృతి బాగా జరుగుతుంది.

ఏ టైం లో లాక్ డౌన్ అంటారో అని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ టీం ను కొన్న యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ను కంగారు మొదలైంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాను సరిగమ సంస్థ 41 కోట్లకు కొంగోలు చేసింది. అక్కడ 20 మిలియన్ తెస్తే కాని హిట్ అనిపించ్కోదు. మరి ఈ టైం లో ఒమిక్రాన్ విజృభిస్తే అక్కడ బయ్యర్ల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇండియాలో కొన్నిచోట్ల మాత్రమే థియేటర్లు ఆపగా... నార్త్ సైడ్ కొన్ని థియేటర్ లు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో నడిపిస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 250 కోట్ల బిజినెస్ చేసింది. అంటే బాహుబలి 2 కలెక్ట్ చేసినంత బిజినెస్ చేసింది. మరి ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్ ఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఏపీలో లేటెస్ట్ గా థియేటర్ ఇష్యూకి 3 వారాలు బ్రేక్ దొరికింది. ఈలోగా సంక్రాంతి సినిమాల సందడి షురూ కానుంది. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ సినిమాలకు ఇది మంచి విషయమే అని చెప్పాలి.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: