టాలీవుడ్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన కొత్త బంగారులోకం సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కొత్త బంగారు లోకం ప్రేమ తో ఒక చక్కటి ప్రేమ కథను తెరకెక్కించి బాక్స్ ఆఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ అడ్డాల  ఈ సినిమాతో ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా పొందాడు. ఇలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో ఒక దర్శకుడిగా కావలసినంత క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత వెంకటేష్, మహేష్ బాబు ఇలాంటి ఇద్దరు స్టార్ హీరోలతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాడు. అప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో తగ్గిపోయిన మల్టీస్టారర్ సినిమాల జోరు ఈ సినిమాతోనే పెరిగింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో శ్రీకాంత్ అడ్డాల కు టాలీవుడ్ లో మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఆ తర్వాత ఈ దర్శకుడు తెరకెక్కించిన ముకుంద, బ్రహ్మోత్సవం సినిమాలు రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర పరాజయాలను చవి చూశాయి.

 అయితే అలాంటి సందర్భంలోనే తమిళంలో విజయం సాధించిన అసురన్ సినిమా తెలుగు రీమిక్ నారప్ప సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఈ దర్శకుడు వచ్చింది. ఈ సినిమాతో ఈ దర్శకుడు ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో అని అనుకున్న వారందరికీ కూడా శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను ఉన్నది ఉన్నట్లుగా తీసి పర్వాలేదు అనిపించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు కొత్త బంగారులోకం లాంటి  ప్రేమకథ సినిమాను చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు అఖండ సినిమాతో మంచి విజయం అందుకున్న మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించ పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: