ఈ సినిమా తరువాత అనుష్కను అరుంధతి అని కొందరూ.. జేజమ్మ అని మరికొందరూ ఇలా ప్రేక్షకుల మనసులో ముద్ర పడిపోయింది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్పై శ్యామ్ ప్రసాద్రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం బాధ్యతలను తన భుజాలపై వేసుకొని సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కోడి రామకృష్ణ అంటేనే గ్రాఫిక్స్కు మారుపేరు.
కోడిరామకృష్ణ దర్శకత్వంలో అనుష్క మెయిన్ లీడ్గా నటించి అప్పుడు, ఇప్పుడు అందరి మన్ననలు పొందుతుంది. నిజానికి ఈ సినిమా ఛాన్స్ తొలుత అనుష్కకు రాలేదట. అప్పుడే ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో నటించిన మమతా మోహన్దాస్కు ఈ అవకాశం వచ్చిందట. కానీ ఆమె ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియక తర్జన భర్జన పడి.. ఈ ఛాన్స్ వదులుకుందట.
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి తన కెరీర్లో గుర్తుండిపోయే బిగ్ బ్లాక్ బాస్టర్ చిత్రం అరుంధతి. అనుష్క నటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసినది. ముఖ్యంగా అనుష్క స్టార్ హీరోయిన్గా మారడమే కాకుండా మళ్లీ లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు ప్రాణమిచ్చినది. అదేవిధంగా చాలా మంది హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డులను అనుష్క ఈ చిత్రంతో సాధించినది. స్టార్ హీరోలు లేకుండానే రూ.15కోట్ల బడ్జెట్తో దాదాపు 70 కోట్ల కలెక్షన్లు సాధించింది అరుంధతి. ఈ తరుణంలోనే అరుంధతి చిత్రమును గుర్తు చేసుకుంటూ అనుష్క తాజాగా ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ఏనటికైనా ఇలాంటి అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుందని.. అరుంధతి చిత్రంలోని జేజమ్మ పాత్ర నా జీవితంలో అలాందినేని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప, మంచి అవకాశాన్ని కల్పించిన దర్శకుడు కోడిరామకృష్ణ, నిర్మాత శ్యామ్ ప్రసాద్రెడ్డిలకు, అరుంధతి టీమ్ మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది అనుష్క. ఏదీ ఏమైనా కోడిరామకృష్ణ-అనుష్క కాంబినేషన్ భారీ హిట్, అదుర్స్ అనే చెప్పుకోవచ్చు.