ప్రముఖ బాలీవుడ్ నటి పూజా మిశ్రా తెలియని వారు ఉండరు. అయితే ఈమె నటుడు అలాగే టీఎంసీ రాజకీయ నాయకుడు అయిన శత్రుఘ్న సిన్హాపై సంచలన ఆరోపణలు చేసింది. కాగా బిగ్ బాస్ 5 షో తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ ఈ మద్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటుడు శత్రుఘ్న సిన్హా అలాగే తన కుటుంబం కలిసి గత 17 ఏళ్లుగా తనను వేధిస్తోంది అన్నట్లుగా చెప్పుకొచ్చింది. తాను “బాలీవుడ్‌‌లో నటిగా ఎదుగుతున్న సమయంలో అమెను ఒక సెక్స్ వర్కర్ గా మార్చేశారని. అలాగే తనపై చేతబడి చేయించి తనని ఒక సెక్స్ రాకెట్ లో నన్ను ఇరిక్కించారని చెప్పింది. అంతే కాకుండా శత్రుఘ్న సిన్హా, మా నాన్న చిన్ననాటి నుంచి స్నేహితులు కావడంతో మా నాన్న అతనికి కోట్లలో డబ్బులు ఇచ్చారని, అతనికి ఆ విశ్వాసం కూడా లేకుండా నన్ను వారు వాడుకున్నారంటున్నారు ఆమె.

కాగా శత్రుఘ్న సిన్హా, అతని భార్య పూనమ్ సిన్హా నన్ను ఒక కీలుబొమ్మలా చేసి ఆడుకున్నారు. అంతేకాదు వారికన్నా ఎదిగి ఎక్కడ నేను ఎక్కువ  పేరు తెచ్చుకుంటానో అని భయపడి , నా జీవితాన్ని ఇలా నాశనం చేశారు. కాగా నేను ఒకరోజు శత్రుఘ్ను సిన్హాకి  పుట్టినరోజున విషెస్ చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పూనమ్ నాకు చేతబడి చేసిన పదార్ధాలను పెట్టడంతో నా శరీరం అప్పటినుండి కంట్రోల్లో లేదు. ఇలాగే ప్రతిసారి నాపై ఏదొక బ్లాక్ మ్యాజిక్  చేస్తూ నన్ను సెక్స్ స్కామ్‌లో పాల్గొనేలా చేసి నా కన్యత్వాన్ని అమ్మి వారు మాత్రం  ఫ్యాషన్ డిజైనర్ గా ఉండిపోవాల్సిన తన కూతురిని హీరోయిన్ గా చేశారు.

అంతేకాదు పూనమ్ అయితే  మహానటిలాగా నటిస్తూ మా నాన్నకు  బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కేవలం వేశ్యలు మాత్రమే పని చేస్తారని అందుకే తాను అడుగుపెట్టలేదని చెప్పి నమ్మించింది. అలాంటప్పుడు తన కూతురును ఎలా ఇండస్ట్రీకి పంపింది..? కేవలం వారివల్లనే నేను ఇంకా పెళ్లి చేసుకోలేకున్నాను. నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసిన కుటుంబం అది. ఇప్పుడు నేను స్టార్ హీరోయిన్ గా ఎదగకపోవటానికి కారణం శత్రుఘ్న సిన్హాన అంటూ చెప్పింది. దీనితో ప్రస్తుతం పూజా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో పెద్ద కలకలం రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: