టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన మారుతి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మారుతి ఈ రోజుల్లో అనే చిన్న సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించాడు. చాలా తక్కువ బడ్జెట్ తో, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ రోజుల్లో సినిమా మంచి విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా, దర్శకుడిగా మారుతి కి మంచి గుర్తింపును కూడా తీసుకు వచ్చింది.

ఆ తర్వాత తక్కువ బడ్జెట్ తో మంచి క్వాలిటీ ఉన్న సినిమాలను నిర్మించి ఆ సినిమాలతో మంచి విషయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ దర్శకుల్లో ఒకరిగా మారుతి కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మారుతి , గోపీచంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా పక్కా కమర్షియల్ మూవీ ని తెరకెక్కించిన విషయం  మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రావు రమేష్ , సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించగా , ఈ సినిమాను యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఈ సినిమా నిన్న అనగా జూలై 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైంది. ఇది ఇలా ఉంటే మారుతి మరి కొన్ని రోజుల్లో ప్రభాస్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు వెలువడలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా పక్కా కమర్షియల్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మారుతి నా తదుపరి సినిమా అప్డేట్ పక్కా కమర్షియల్ మూవీ విడుదల అయిన తర్వాత 10 రోజులకు వస్తుంది అని తెలియజేశాడు. మరి మారుతి  ఇవ్వబోయే అనౌన్స్మెంట్ ప్రభాస్ సినిమాకు సంబంధించినదే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి మారుతి చేయబోయే అనౌన్స్మెంట్ ప్రభాస్ సినిమాకు సంబంధించినదా... లేక వేరే ఏదైనా సినిమాకు సంబంధించినదా... అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: