జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు హైపర్ ఆది. అప్పటి వరకు ఎవరికీ తెలియని హైపర్ ఆది జబర్దస్త్ లో టీం లీడర్ గా మారినా తర్వాత మాత్రం అందరికీ సుపరిచితులు గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక తన పంచులతో అటు జబర్దస్త్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు హైపర్ ఆది. తక్కువ సమయంలోనే జబర్దస్త్ లో టాప్ టీం లీడర్ గా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఇక జబర్దస్త్ లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది అటు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ ఉన్నాడు.


 ఈ క్రమంలోనే తన స్క్రిప్ట్ రైటింగ్ తో కూడా బిజీ బిజీ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేశాడు హైపర్ ఆది.  ఈటీవీ లో ప్రసారమయ్యే మిగితా షో లలో కనిపిస్తున్నాడు. కానీ జబర్దస్త్ లో మాత్రం హైపర్ ఆది కనిపించడం లేదు అని చెప్పాలి. ఇక కేవలం హైపర్ ఆది మాత్రమే కాదు గెటప్ శీను సుడిగాలి సుదీర్ లాంటి వాళ్లు కూడా జబర్దస్త్ నుండి తప్పుకున్నారు. ఇక ఇప్పుడు యాంకర్ అనసూయ సైతం అదే చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. జబర్దస్త్ లో ఆది అగ్రిమెంట్  అయిపోవడం  ఇలా తప్పుకున్నట్లు  తెలుస్తుంది.


 అయితే హైపర్ ఆది ఒకప్పటిలా ఎందుకు పంచులు వేయడం లేదు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు ఆది వేసే పంచులు కి నవ్వి నవ్వి అందరి బుగ్గలు నొప్పెటవి జడ్జ్ రోజా సైతం ఈ విషయం చాలా సార్లు చెప్పింది.  కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం హైపర్ ఆది పంచులు ఎంతో పేలవంగా మారిపోయాయి. అయితే ఇటీవల కాలంలో హైపర్ ఆది బిజీ కావడం వల్ల తన పనిపై ఎక్కువగా ఏకాగ్రత చూపడం లేదని  టాక్ కూడా ఉంది. ప్రస్తుతం ఈటీవీ లో హైపర్ ఆది నోటీస్ పిరియడ్ లో ఉన్నాడని అందుకే పెద్దగా తన వర్క్ మీద దృష్టి పెట్టడం లేదంటూ కొత్త చర్చ కూడా మొదలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: