టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి విడుదల కు సిద్ధంగా ఉన్నా మోస్ట్ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో లైగర్  మూవీ ఒకటి. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా , అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ లో రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ కు తల్లి పాత్రలో నటించగా , ఒక కీలక పాత్రలో ఈ మూవీ లో మైక్ టైసన్ కూడా కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కానక్ట్స్  బ్యానర్ లపై కరణ్ జోహార్ మరియు పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫుల్ స్పీడ్ లో జరుపుకుంటోంది. ఈ సినిమాను ఆగస్ట్ 25 వ తేదీన భారీ ఎత్తున తెలుగు తో పాటు తమిళ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే లైగర్ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ భారీ రేటుకు దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

అలాగే ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని వారాలకు డిజిటల్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: