బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో అభినయశ్రీ ఒకరు.ఇక  తెలుగులో స్పెషల్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన అభినయశ్రీ బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేశారు.ఇదిలావుండగా అభినయశ్రీ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. అయితే రెండు వారాలకే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అభినయశ్రీ బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే బిగ్ బాస్ షో ద్వారా తనకు 5 లక్షల రూపాయల పారితోషికం దక్కిందని వార్తలు వైరల్ అవుతున్నాయని అయితే వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అభినయశ్రీ అన్నారు. అయితే నన్ను స్క్రీన్ లో అస్సలు చూపించలేదని అభినయశ్రీ కామెంట్లు చేశారు. ఇక బిగ్ బాస్ యాజమాన్యం షోలో కొంతమందిని మాత్రమే ఎక్కువగా చూపిస్తోందని అభినయశ్రీ చెప్పుకొచ్చారు.కాగా  బిగ్ బాస్ నిర్వాహకులు వెనుక ఉన్నవాళ్లను అస్సలు చూపించడం లేదని ఆమె తేల్చి చెప్పారు.ఇకపోతే  బిగ్ బాస్ వల్ల నాకు గుడ్ జరగలేదని బ్యాడ్ జరిగిందని ఆమె కామెంట్లు చేశారు.

అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోపల ఏం జరుగుతుందో చెప్పడం సులువు కాదని ఆమె కామెంట్లు చేశారు.ఇక  బిగ్ బాస్ షో అంతా మోసమని బిగ్ బాస్ నన్ను మోసం చేశాడని అభినయశ్రీ అన్నారు.అయితే  అభినయశ్రీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే  గతంలో కూడా చాలామంది కంటెస్టెంట్లు ఈ తరహా ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నా షో నిర్వాహకులు మాత్రం ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోవడం లేదు.కాగా  బిగ్ బాస్ షో రేటింగ్స్ సైతం ఆశించిన విధంగా లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో అయినా బిగ్ బాస్ షో రేటింగ్స్ పుంజుకుంటాయో లేదో చూడాల్సి ఉంది.అంతేకాదు  అభినయశ్రీ చేసిన కామెంట్లపై రాబోయే రోజుల్లో ఇతర కంటెస్టెంట్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: