రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ యూనిట్ మాత్రం ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లను కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు.

దానితో ఆది పురుష్ మూవీ యూనిట్ పై ప్రభాస్ అభిమానులు కాస్త నిరుత్సాహాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి వి ఎఫ్ ఎక్స్ పనులు అత్యధికంగా ఉండడం ద్వారానే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటివ్వరకు ఎలాంటి అప్డేట్ లను కూడా విడుదల చేయలేదు అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆది పురుష్ మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ని అక్టోబర్ 3 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండగా కృతి సనన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: