రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మళ్లీ రీ యంట్రి ఇచ్చింది హీరోయిన్ రేణు దేశాయ్.. ఇందులో ఈమె ఒక కీలకమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది రేణు దేశాయ్. ఈమె పాత్రను చూసి అభిమానులకు నిరాశని మిగిల్చింది. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత తన జర్నీ ఎలా సాగింది సినిమాలకు దూరంగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనే విషయాలను తెలిపింది


ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్న ఎదురవగా ఈ ప్రశ్నను తనని అడగొద్దు అంటూ తెలిపింది.. ఒక పొలిటిషన్ గా ఈ సొసైటీకి అవసరం మాత్రమే ఇదివరకు ఈ విషయంపై ఎన్నోసార్లు తెలియజేశాను.. ఆయన సీఎం అవుతారా లేదా అనే విషయం నేను చెప్పలేను ఆ విషయాన్ని దేవుడికే వదిలేస్తున్నాను ఫలానా వ్యక్తికి ప్రచారం చేయండి అని నేను ఎలాంటి ఎన్నికల ప్రచారాన్ని కూడా చేయలేదు. అది నాకు అనవసరం.. పవన్ గురించి తాను చెప్పిన విషయాలన్నీ వీడియోలో చెప్పిన నిజాలే అంటూ తెలియజేయడం జరిగింది.


విడాకుల సమయంలో నేను ఏదైతే చెప్పాను అదంతా నిజమే సింగిల్ మదర్ గా చాలా కష్టాలను ఎదుర్కొన్నాను తన బిడ్డలు తప్పు చేస్తే తననే తప్పు పట్టడం జరిగిందని రేణు దేశాయ్ తెలియజేసింది.. టైగర్ నాగేశ్వరరావు లో ఈమె పాత్ర గురించి రిలీజ్ ముందు బాగా హైప్ తీసుకురావడం జరిగింది.. కానీ విడుదలయ్యాక అభిమానులకు నిరాశన మిగిల్చింది రేణు దేశాయ్ కేవలం సినిమాల పైన బజ్ పెంచుకునేందుకు తప్ప ఏమాత్రం ఉపయోగపడలేదని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ వాక్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: