సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ లోనే మెరవాలి అన్న రూల్ లేదు.  మిగతా క్యారెక్టర్స్ లో కూడా మెరుస్తూ ఉంటారు . కొంతమంది వాళ్లకి ఉన్న క్రేజ్ తగ్గిపోయాక అక్క - వదిన - అత్త - హీరోయిన్ కి తల్లి పాత్రలో కూడా కనిపిస్తూ ఉంటారు . అయితే హీరోయిన్స్ క్రేజ్ ఉన్నప్పుడే స్పెషల్ సాంగ్ లో కనిపించడం ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారిపోయింది.  చాలామంది స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేస్తూ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. కాగా ఇప్పటికే చాలామంది ఆ లిస్టులోకి వచ్చేశారు.


కొందరు మాత్రం స్పెషల్ సాంగ్స్ లో అస్సలు నటించమంటూ తెగేసి చెబుతున్నారు . ఆ లిస్టులోకే వస్తుంది మహానటి కీర్తి సురేష్ . కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . కీర్తి సురేష్ నటన .. టాలెంట్.. అందం ఏ హీరోయిన్ కి లేనే లేదు అని చెప్పాలి. కాగా కీర్తి సురేష్ ని కూడా చాలా మంది డైరెక్టర్ లు స్పెషల్ సాంగ్ లో నటించాలి అంటూ రిక్వెస్ట్ చేశారట . కానీ కీర్తి సురేష్ మాత్రం నో అంటూ తెగ్గేసి చెప్పేస్తుందట . మరీ ముఖ్యంగా సమంత కెరీయర్ని టర్న్ చేసిన "ఉ అంటావా మావ" పాట కోసం ముందుగా సుకుమార్ ..హీరోయిన్ కీర్తి సురేష్ ని అనుకున్నారట .



కానీ ఆమె నో చెప్పడంతో ఆ ఆఫర్ సమంత వద్దకు వచ్చిందట. అంతేకాదు అంతకుముందే సుకుమార్ రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేల్ రాణి పాట కోసం కూడా కీర్తి సురేష్ ని అప్రోచ్ అయ్యారట.  హైలెట్ ఏంటంటే ఆమె ముందే ఆ పాటను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఆ ఆఫర్ పూజా హెగ్డే ఖాతాలో పడింది. పూజ హెగ్డే - సమంత ఇద్దరు కూడా ఐటెం సాంగ్ లో మెరిసి తమకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు.  కీర్తి సురేష్ ఈ పాటలను రిజెక్ట్ చేసుకున్న ఆమె కెరియర్ కూడా బాగా హై స్ధానంలోనే ఉండింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: