అనుష్క–ప్రభాస్ తర్వాత సోషల్ మీడియాలో ఎప్పటికీ ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఏదైనా ఉంటే, అది కచ్చితంగా రష్మిక మందన్న–విజయ్ దేవరకొండ ప్రేమాయణమే అని చెప్పాలి. వీళ్ళు నిజంగా ప్రేమించుకుంటున్నారా? లేక కేవలం ఫ్రెండ్సేనా? అనేది ఇప్పటివరకు ఎవరికీ అర్థం కాలేదు. కొన్నిసార్లు వీరి ప్రవర్తన చూస్తే ప్రేమలో ఉన్నారని అనిపిస్తుంది. మరికొన్నిసార్లు మంచి స్నేహితుల్లా అనిపిస్తుంది. అయితే ప్రేమ విషయాన్ని వీళ్లు ఎప్పుడూ బహిరంగంగా బయట పెట్టలేదు. కానీ, మేము ప్రేమలో ఉన్నామనే సంకేతాలను తమ ప్రవర్తన ద్వారా అనేకసార్లు ఇచ్చినట్టే అనిపిస్తుంది. .


ఇటీవల అమెరికాలోని న్యూయార్క్‌లో భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఇండియా డే పరేడ్" ఘనంగా జరిగింది. ఇది అమెరికాలో జరిగే అతిపెద్ద భారతీయ పరేడ్. ఈ వేడుకకు అనేకమంది భారతీయ–అమెరికన్లు, విదేశీ స్నేహితులు హాజరయ్యారు. ముఖ్యంగా సినీ స్టార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి 2025 సంవత్సరానికి గాను గ్రాండ్ మార్షల్‌గా హాజరైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రతినిధులుగా చాటి చెప్పారు. వీరిని చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ పరేడ్‌లో వీరిద్దరినీ జంటగా చూసిన వారు, “అచ్చం భార్యాభర్తలాగే ఉన్నారు. నిజమైన భార్యాభర్తలు కూడా ఇంత ఆనందంగా ఉండరు. త్వరలోనే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు ..



మరికొంతమంది అయితే, “వీళ్లు ఇప్పటికే పెళ్లి చేసుకున్నారేమో. అందుకే ఇంత చనువుగా, ఇంత ఆనందంగా కనిపిస్తున్నారు” అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత పబ్లిక్‌లో ఏ హీరో–హీరోయిన్ ఇలా ఉండరు. అలా ఉన్నారంటే ప్రేమ ఉన్నట్టే. త్వరలోనే రష్మిక–విజయ్ జంట నుంచి గుడ్ న్యూస్ వినబోతున్నాం” అని ఫ్యాన్స్ అంటున్నారు. చూద్దాం..మరి వీళ్ళ నుంచి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వినబోతున్నామో ...??

మరింత సమాచారం తెలుసుకోండి: