టాలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించిన రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి పాన్ వరల్డ్ చిత్రం SSMB 29. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. నవంబర్ 15వ తేదీన ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాదులో భారీ ఈవెంట్ జరగబోతోంది. అయితే ఈవెంట్ కంటే ముందే రాజమౌళి వరుసగా సడన్ సర్ప్రైజ్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. కుంభ పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లుగా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. మహేష్ బాబు సంబంధించి సంచారి పాటను శృతిహాసన్ తో పాటించి పైలెట్గా నిలిచింది. గత కొద్ది రోజుల నుంచి హీరోయిన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తారంటూ వార్తలు వినిపించినప్పటికీ తాజాగా విడుదల చేశారు.



 SSMB 29 సినిమాలో ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను పరిచయం చేస్తూ రాజమౌళి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా చీర ధరించి చేతిలో గన్ను పట్టుకొని మరీ చాలా అగ్రేసివ్ గా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో నటిస్తున్నట్లు రాజమౌళి తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో మాత్రం ప్రియాంక చోప్రా అందరిని ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది.ఇందుకు సంబంధించి పోస్టర్ వైరల్ గా మారుతోంది.


ఇక మహేష్ బాబు లుక్ కోసమే అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. సుమారుగా రూ .1000 కోట్ల బడ్జెట్ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమా. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమౌళి కూడా ఈ సినిమా పైన వరుస అప్డేట్లు ఇస్తూ ఇప్పటినుంచి ప్రమోషన్స్ ని మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది. SSMB 29 సినిమా టైటిల్ కోసం అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురుచూస్తున్నారు. గత కొద్దిరోజులుగా వారణాసి అనే టైటిల్ వినిపిస్తున్నప్పటికీ ఈ విషయం పైన చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: