బిగ్ బాస్ సీజన్ థ్రీ అందరికీ ఆకట్టుకునేలా సాగుతోందన్నది తెలిసిందే. ఇప్పటికి నలభై రోజులుగా బిగ్ బాస్ తెలుగు లోగిళ్ళనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అలరిస్తోంది. ఐతే బిగ్ బాస్ స్టార్ట్  అయిన మొదటి వారం నుంచే ఎలిమినేషన్స్ కూడా మొదలెట్టేసారు. అలా మొదటి వారం సీనియర్ నటి హేమ అవుట్ అయ్యారు.


ఆ తరువాత వరసగా జాఫర్, రోహిణి, ఆషురెడ్డి అవుట్  అయిపోయారు. ఇపుడు ఆరవవారం నడుస్తోంది. ఈ వారానికి గాను ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వారు వరుణ్ సందేశ్, రాహుల్, రవి క్రిష్ణ, హిజజ, పునర్ణవి, మహేష్. అయితే ఇందులో ముగ్గురు అంటే వరుణ్, రాహుల్, రవి క్రిష్ణ సీక్రెట్ టాస్క్ ఆడి గెలిచి  ఎలిమినేషన్ నుంచి తప్పించుకుని సేఫ్ జోన్లొకి వచ్చేశారు


ఇక మిగిలిన ముగ్గురు హిమజ, మహేష్, పునర్ణవి లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న టెన్షన్ అందరిలో ఉంది. అయితే ఇపుడున్న ముగ్గురూ కూడా ఈ వారం ఎలిమినేట్ అవరన్నది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పుట్టిన రోజు వేడుకల కోసం నాగార్జున స్పెయిన్ లో ఉండడంతో రమ్యక్రిష్ణ ఆ ప్లేస్ లో హోస్ట్ చేస్తున్నారు.


దాంతో సరద సరదాగా గేం ముగించేస్తారని అంటున్నారు. కేవలం ముగ్గురు మాత్రమే ఉండడం, పైగా నాగ్ లేకపోవడంతో ఈ వారం ఎలిమినేషన్ ప్రోసెస్ ని ఆపేశారని టాక్. సో వీరంతా మరో వారం ఆడేందుకు రెడీ అవుతున్నారన్న మాట. నిజానికి ఎలిమినేషన్ జరిగితే మాత్రం పునర్ణవి అవుటయ్యేది అంటున్నారు. ఆమెకు అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయట.  ఆ విధంగా చూస్తే అందరి కంటే కూడా పునర్ణవి చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఈ వారం ఆమె గట్టిగా గేం ఆడితే ఇంకా కొనసాగే చాన్స్ పెరుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: