అమెరికాలో
భారత సతతికి చెందిన గూగుల్ సీఈవో సుదర్ పిచాయ్ కి అరుదైన గౌరవం లభించింది.
టెక్నాలజీ అభివృద్ధి రంగంలో సుదర్ పిచాయ్ చేసిన విప్లవాత్మకమైన మార్పులు, సేవలకి
గాను పిచాయ్ ని ఈ అవార్డు వరించింది. అమెరికా భారత్ వాణిజ్య మండలి ప్రతీ ఏడాది
ఇచ్చే గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్ కి పిచాయ్ ని ఎంపిక చేసినట్లుగా ప్రకటించింది.
పిచాయ్ తో పాటుగా, నాస్డాక్ ప్రెసిడెంట్ అడెనా ఫ్రైడ్మాన్ పేరుని కూడా ఈ సంస్థ ప్రకటించింది. వీరు ఇద్దరి నేతృత్వంలోని వారు పని చేస్తున్న కంపెనీలు, అంతర్జాతీయ టెక్నాలజీ రంగలో ఉత్తమమైన వారధిని ఏర్పాటు చేయడంలో తమ వంతు కీలక పాత్రలని పోషించినట్లుగా తెలిపింది.
ఈ రెండు సంస్థల కారణంగా భారత్ అమెరికా మధ్య వస్తు, సేవల వాణిజ్యం జరిగిన ఐదేళ్ళలో 150 శాతం పెరిగిందని గత ఏడాదికి 142.1 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపింది.ఇక వచ్చేవారం జరగనున్న ఇండియా ఐడియాస్ సదస్సులో వీరికి ఈ అవార్డ్ లు ఇవ్వనున్నట్లుగా అమెరికా భారత్ వాణిజ్య మండలి ప్రకటించింది