ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా నేరాలు పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైనా సభ్యసమాజం తలదించుకునేలా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వన్నాయి.  నిన్నటికి నిన్న హయత్ నగర్ లో తన ప్రియుడితో కలిసి 20 ఏళ్లు కనీ పెంచిన కన్న తల్లిని అత్యంత దారుణంగా చంపింది  కూతురు కీర్తిరెడ్డి. అయితే ఆ హత్య కప్పి పుచ్చడానికి ఎన్నో ఎత్తులు వేసింది..చివరికి తన తండ్రిపైనే ఫిర్యాదు చేసింది. కానీ పాపం పండింది..హత్య చేసింది కీర్తి రెడ్డి ఆమె ప్రియుడు శిశికుమార్ అని తేలడంతో ఇప్పుడు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది.  తాజాగా ఈ దారుణమైన ఉదంతం మరువక ముందే గుంటురు మరో దారుణం వెలుగులోకి వచ్చింది.  అయితే ఇక్కడ కూడా విలన్ కూతురు కావడం శోచనీయం. 

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి అని కూడా చూడకుండా ఆస్తికోసం అత్యంత కృరంగా తల్లిని చంపేసింది. మృతురాలు ఆలపాటి లక్ష్మి భర్త ఇటీవల కన్నుమూశారు.  దాంతో ఆలపాటి లక్ష్మి  ఆస్తిపై కూతురు బార్గవి కన్నుపడింది..దాంతో తల్లి వద్దకు వచ్చి ఆస్తి తనకు ఇవ్వమని పోరు పెట్టడం మొదలు పెట్టింది.  అయితే తన ఆస్తి భార్గవికి ఇస్తే తనను బయటకు నెట్టేస్తారన్న భయంతో ఆలపాటి లక్ష్మి తన కూతురుకి ఆస్తి ఇవ్వనని భీష్మించింది.  దాంతో తన తల్లిని కడతేరిస్తే ఆస్తి తనకు దక్కుతుందని భావించిన భార్గవి ఓ భయంకరమైన పథకం వేసింది.

ఈనెల 10న ఆలపాటి లక్ష్మిని కుమార్తె భార్గవి తన భర్త, బాయ్ ఫ్రెండ్ తో కలిసి హత్య చేయించింది. అయితే పోలీసు కేసు కాకుండా తన తల్లి అనారోగ్యంతో మరణించిందని చెప్పింది.  అంతే కాదు తమకు ఎవరితో శత్రుత్వం లేదని చెప్పింది.  అయితే పోస్ట్ మార్టం లో ఆమె గొంతు నులిమి చంపినట్లు తేలింది. దాంతో పోలీసులు తమదైన స్టైల్లో భార్గవి ఆమె భర్తను విచారణ చేయడంతో అసలు నిజం చెప్పింది. కేసు నమోదు చేసుకొని కస్టడిలోకి తీసుకున్నారు పోలీసులు.  కేవలం ఆస్తి, క్షణికమైన సుఖాల కోసం ఏకంగా కన్న కూతుళ్లే తమ తల్లులను చంపడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: