టీఆరెస్ నాయకులు , కార్యకర్తలు - ఎల్బీనగర్ ప్రధాన రహదారి ( దిల్ సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ ) వద్ద రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ , నిరసన ప్రదర్శనలు తెలియజేయడంతో , ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ నిరసనల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, నాయకులు , కార్యకర్తలతో కలసి కేంద్ర ప్రభుత్వం, మోడీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వరి కంకుల తో నిరసన ప్రదర్శనలు నిర్వహించి , రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లును తక్షణమే రద్దు చేసి , రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. హైదరాబాద్ నలుమూలలా కూడా బంద్ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. భారత్ బంద్ నేపధ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా హైదరాబాద్ లో భద్రత ఏర్పాటు చేసారు. ఈ బంద్ కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.