ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన వీర సైనికులకు పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే భారత ఆర్మీ నిర్ణయించింది. లాన్స్ నాయక్ సాయితేజ, లాన్స్ నాయక్ వివేక్ కుమార్ భౌతిక కాయాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అందజేశారు కూడా. మిగిలిన వారికి ఢిల్లీలోని కంటోన్మెంట్ బేస్ ఆసుపత్రిలో పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించిన తర్వాత వారి వారి స్వస్థలాలకు తరలించారు. సాయితేజ మృతదేహాన్ని ఢిల్లీ నుంచి నేరుగా బెంగళూరు విమానాశ్రయం తరలించారు. అక్కడి నుంచి స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎగువరేడ గ్రామానికి ప్రత్యేక వాహనంలో తరలించనున్నారు ఆర్మీ అధికారులు. సాయితేజ మృతదేహం గుర్తించేందుకు ఆర్మీ ఆధికారులు తీవ్రంగా శ్రమించారు. ముందుగా తల్లిదండ్రులు, పిల్లల రక్త నమూనాలను సేకరించారు. అయితే లాన్స్ నాయక్ సాయితేజ చేతిపై ఉన్న పచ్చబొట్టు ద్వారా మృతదేహం గుర్తించారు. ఒక చేతిపై శ్యామ అని, మరో చేతిపై త్రిశూలం పచ్చబొట్లు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. శనివారం సాయంత్రానికి సాయితేజ అంత్యక్రియలు పూర్తి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన వీర సైనికులకు పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే భారత ఆర్మీ నిర్ణయించింది. లాన్స్ నాయక్ సాయితేజ, లాన్స్ నాయక్ వివేక్ కుమార్ భౌతిక కాయాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అందజేశారు కూడా. మిగిలిన వారికి ఢిల్లీలోని కంటోన్మెంట్ బేస్ ఆసుపత్రిలో పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించిన తర్వాత వారి వారి స్వస్థలాలకు తరలించారు. సాయితేజ మృతదేహాన్ని ఢిల్లీ నుంచి నేరుగా బెంగళూరు విమానాశ్రయం తరలించారు. అక్కడి నుంచి స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎగువరేడ గ్రామానికి ప్రత్యేక వాహనంలో తరలించనున్నారు ఆర్మీ అధికారులు. సాయితేజ మృతదేహం గుర్తించేందుకు ఆర్మీ ఆధికారులు తీవ్రంగా శ్రమించారు. ముందుగా తల్లిదండ్రులు, పిల్లల రక్త నమూనాలను సేకరించారు. అయితే లాన్స్ నాయక్ సాయితేజ చేతిపై ఉన్న పచ్చబొట్టు ద్వారా మృతదేహం గుర్తించారు. ఒక చేతిపై శ్యామ అని, మరో చేతిపై త్రిశూలం పచ్చబొట్లు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. శనివారం సాయంత్రానికి సాయితేజ అంత్యక్రియలు పూర్తి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.