పెగాసస్పై చర్చకు చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి నోటీసు ఇవ్వగా, స్వల్పకాలిక చర్చ జరుగుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. పెగాసస్ స్పైవేర్ కంపెనీ కొనుగోలు చేసేందుకు తమ వద్దకు వచ్చిందని నాటి ఐటీ మంత్రి నారా లోకేష్ చెప్పారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. దీన్ని ఎవరు కొనుగోలు చేశారు, ఎలా ఉపయోగించారనేది ఇంకా తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ సభ్యులు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తూనే ఉన్నారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరినప్పటికీ విలువైన సమయాన్ని వృథా చేస్తూ నినాదాలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిఘా వ్యవస్థని భ్రష్టు పట్టించారు. అధికారులు, పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుపై అనేక ఆరోపణలు వచ్చాయి.. చివరికి సినిమా యాక్టర్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు.. మమతాబెనర్జీ.. చంద్రబాబుపై ఆరోపణలు చేయటంతో ఈ విషయం మళ్ళీ వెలుగులోకి వచ్చిందని వైసీపీ సబ్యులు చెప్పారు.
పెగాసస్పై చర్చకు చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి నోటీసు ఇవ్వగా, స్వల్పకాలిక చర్చ జరుగుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. పెగాసస్ స్పైవేర్ కంపెనీ కొనుగోలు చేసేందుకు తమ వద్దకు వచ్చిందని నాటి ఐటీ మంత్రి నారా లోకేష్ చెప్పారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. దీన్ని ఎవరు కొనుగోలు చేశారు, ఎలా ఉపయోగించారనేది ఇంకా తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ సభ్యులు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తూనే ఉన్నారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరినప్పటికీ విలువైన సమయాన్ని వృథా చేస్తూ నినాదాలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిఘా వ్యవస్థని భ్రష్టు పట్టించారు. అధికారులు, పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుపై అనేక ఆరోపణలు వచ్చాయి.. చివరికి సినిమా యాక్టర్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు.. మమతాబెనర్జీ.. చంద్రబాబుపై ఆరోపణలు చేయటంతో ఈ విషయం మళ్ళీ వెలుగులోకి వచ్చిందని వైసీపీ సబ్యులు చెప్పారు.